ఇది క్లియర్: శిల్పాకు రాజగోపాల్ ట్విస్ట్.. జగన్ తనకే 'టికెట్' ఇస్తారన్న ధీమా!
మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. శిల్పామోహన్ రెడ్డికి నంద్యాల టికెట్ దక్కడం అనుమానమే అన్న అభిప్రాయం కలగకమానదు. ఈ లెక్కన జగన్ నుంచి ఎలాంటి భరోసా లభించుకుండానే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుక
నంద్యాల: మాజీ మంత్రి, టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్న తరుణంలో.. నంద్యాల రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. నిన్నటిదాకా టీడీపీలో సొంతగూటి పంచాయితీని తలపించిన ఈ వ్యవహారం.. ఇప్పుడు వైసీపీలోను నిప్పు రాజేస్తుందా? అన్న సందేహాలను రేకెత్తిస్తోంది.
తాజాగా నంద్యాల నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జీ.. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.ఓవైపు పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని చెబుతూనే.. మరోవైపు ఉపఎన్నికలో టికెట్ తనదేనంటూ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

టికెట్ గురించి జగన్ ఆయనకేమైనా చెప్పారా? అని ప్రశ్నించారు. అంతేకాదు, నంద్యాల టికెట్ తనకేనని జగన్ తొలి నుంచి చెబుతున్నారని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని జగన్ వద్ద కూడా మళ్లీ ప్రస్తావిస్తామన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు 30ఏళ్ల అనుబంధం ఉందని, జగన్ తనకు అన్యాయం చేయరని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ నిర్ణయం తనకు ప్రతికూలంగా ఉన్నా.. టికెట్ రాకపోయినా.. అప్పుడు ఆలోచిద్దామన్నారు.
మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. శిల్పామోహన్ రెడ్డికి నంద్యాల టికెట్ దక్కడం అనుమానమే అన్న అభిప్రాయం కలగకమానదు. ఈ లెక్కన జగన్ నుంచి ఎలాంటి భరోసా లభించుకుండానే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దపడ్డారని తెలుస్తోంది.
ఉపఎన్నిక విషయంలో శిల్పామోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. జగన్ మదిలో ఏముందనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఈ ఇద్దరిని సమన్వయపరిచేలా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై వైసీపీ నంద్యాల రాజకీయం ఆధారపడి ఉంది. అలా కాకుండా.. ఇద్దరిలో ఎవరు నొచ్చుకున్నా..వైసీపీ రాజకీయం మరో మలుపు తిరగడం ఖాయం.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications