కెసిఆర్కు డిఎస్ అమ్ముడుపోతారు: రాజలింగం
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి కాంగ్రెసు పక్ష నేతగా డి. శ్రీనివాస్ ఎన్నికను ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజలింగం తీవ్రంగా వ్యతిరేకించారు. డిఎస్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అమ్ముడుపోతారని ఆయన ఆరోపించారు. ఓటింగ్ లేకుండా కాంగ్రెసు పక్ష నేతను ఎలా ఎన్నుకుంటారని ఆయన ప్రశ్నించారు.
పార్టీ అధిష్టానం పేరు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండున్నరేళ్లలో డిఎస్ పది సార్లు కూడా మండలికి రాలేదని, డిఎస్ సమావేశాలకే రారని ఆయన అన్నారు. లాలూచీ పడి అధిష్టానం డబ్బున్నవారికే పదవులు ఇస్తోందని ఆయన విమర్శించారు.

డిఎస్ ఎన్నికను వ్యతిరేకించవద్దని పది లక్షల రూపాయలు పంపిస్తే తాను వెనక్కి పంపినట్లు ఆయన తెలిపారు. సీనియారిటీ పేరుతో అధిష్టానం పెద్దలు ప్రయోజనం లేని నాయకులకు పదవులు కట్టబెడుతోందని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకునే తనను ఎన్నుకున్నట్లు డిఎస్ తెలిపారు. తమ పార్టీ అధినేత సోనియా గాంధీని సంప్రదించిన తర్వాతనే తన ఎన్నికను ప్రకటించారని ఆయన చెప్పారు. తాను, షబ్బీర్ అలీ కలిసి పనిచేయాలని అధిష్టానం పెద్దలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నా కలుపుకుని పోతామని చెప్పారు. తెరాస ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేస్తామని చెప్పారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications