క్యూలో 'సత్యం' రాజు: ఫ్యామిలీతో బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: లోకసభకు, శాసనసభకు తెలంగాణలో బుధవారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాదులోని సంపన్న వర్గాలకు చెందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తమ ఓట్లను వేశారు. క్యూలో నిలబడి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి తమ తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు.
హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదరు సంఘటనలు చోటు చేసుకున్నాయి. యాకూత్పురాలో మజ్లీస్, ఎంబిటిల మధ్య ఘర్షణ జరిగింది. ఎల్బీ నగర్లో కాంగ్రెసు అభ్యర్థి సుధీర్ రెడ్డి అనుచరులు టిడిపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య అనుచరులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఫ్యామిలీతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి గాయత్రి హిల్స్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
జీవితా రాజశేఖర్ దంపతులు
బిజెపిలో చేరిన జీవితా రాజశేఖర్ దంపతులు బుధవారంనాడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
క్యూలో సత్యం రామలింగరాజు
సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ రాజు బుధవారంనాడు క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
డిజిపి దంపతులు..
డిజిపి ప్రసాదరావు దంపతులు బుధవారంనాడు పంజాగుట్టలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మాజీ డిజిపి దినేష్ రెడ్డి..
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి దినేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొండా విశ్వేశ్వర రెడ్డి భార్యతో కలిసి...
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చేవెళ్ల లోకసభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తన సతీమణి సంగీతారెడ్డితో కలిసి వచ్చి ఓటేశారు.
జయప్రకాష్ నారాయణ కూడా..
లోకసత్తా మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి జయప్రకాష్ నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఎర్రమంజిల్లో ఓటేశారు.
సైనా నెహ్వాల్...
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరా చుక్క అంటిన వేలిని ప్రదర్శించారు.