పోలవరం చీఫ్ ఇంజనీర్ బదిలీ.. జగన్ సంచలన నిర్ణయం... ఇందుకే !!
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎపీలోనే కాక కేంద్రం లో పెద్ద చర్చ జరుగుతున్న వేళ పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ బదిలీ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం పనుల్లో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలతో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళిన ఏపీ సర్కార్ కు అటు కోర్టు తీర్పు, ఇటు కేంద్రం సీరియస్ గా ఉండటం వంటి అంశాలు పెద్ద తలనొప్పిగా మారాయి.

పోలవరం చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రావు బదిలీ .. ఆ స్థానంలో సుధాకర్ బాబు
ఇక పోలవరం ప్రాజెక్టును తమ హయాంలో పూర్తి చెయ్యాలని సంకల్పించిన వైసీపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విఘాతం కల్గించాయి. ఇక ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం వెంకటేశ్వరరావు రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్గా ఉంటూనే పోలవరం చీఫ్ ఇంజినీర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ గా ఉన్న ఆయన మీద బదిలీ వేటు వేసిన జగన్ సర్కార్ ఆ స్థానంలో సుధాకర్ బాబును నియమించింది

15 ఏళ్లపాటు పోలవరం ప్రాజెక్టు కోసం పని చేసిన చీఫ్ ఇంజనీర్ .. బదిలీకి కారణం ఇదే
15 ఏళ్లపాటు పోలవరం ప్రాజెక్టు కోసం నిరంతరం శ్రమించిన వెంకటేశ్వర రావును ప్రభుత్వం తప్పించడం ఇంజినీరింగ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ సహా నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఆయన పోలవరం కోసం పని చేశారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం కేంద్రం నుంచి పరిహారం తీసుకురావడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. అలాంటి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ను తప్పించటం వెనుక గల బలమైన కారణాలు ఏంటి అన్న ఆలోచనలో ఇంజనీరింగ్ వర్గాలు ఉన్నాయి. ఇటీవల పోలవరం పై పీపీఏ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఆయన పీపీఏలో సభ్యుడు కాబట్టి కేంద్రానికి ఇచ్చిన నివేదిక జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండటం కూడా ఒక కారణం అని తెలుస్తుంది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించకుండా పీపీఏ నివేదికలో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ నివేదిక ఇచ్చారు అన్న చర్చ సాగుతుంది. అంతే కాదు గత ప్రభుత్వ అవినీతిని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో గత చంద్రబాబు హయాంలో పని చేసిన అధికారి చీఫ్ ఇంజనీర్ గా ఉంటె గత ప్రభుత్వ అవినీతి బయటకు తీసుకురావటం సాధ్యం కాదన్న భావన ఉన్నట్టు , అందుకే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ సాగుతుంది.

వెంకటేశ్వరరావుకు పోలవరం అధారిటీ సభ్యత్వ రద్దు .. పీపీఏ సభ్యుడిగా సిఈ సుధాకర్ బాబు
వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్గా కొనసాగించాలని ఆదేశించటం ,పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయటం వంటి నిర్ణయాలు తీసుకుంది. వెంకటేశ్వరరావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా సిఈ సుధాకర్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుధాకర్ బాబు ఇకపై పోలవరం చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించనున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications