ఏపీకి వెళ్లండి.. తెలంగాణలోని ఐపీఎస్లకు కేంద్రం షాక్
తెలంగాణలో కొనసాగుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాకిచ్చింది. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఈ ముగ్గురు అధికారులు వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
అంతేగాక, 24 గంటల్లోనే ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అధికారులను ఏపీకి కేటాయించారు. అయితే, ట్రిబ్యునల్ను ఆశ్రయించిన వారు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీజీ ర్యాంకులో కొనసాగుతున్న అంజనీకుమార్.. రోడ్ సేఫ్టీ డీజీగా ఉన్నారు.

డీజీ ర్యాంకులో ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్.. పోలీస్ ట్రైనింగ్ డీజీగా ఉన్నారు. ఎస్పీ ర్యాంకులో కొనసాగుతున్న అభిషేక్ మహంతి.. ప్రస్తుతానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించిన కేంద్ర హోంశాఖ.. వెంటనే ఏపీ క్యాడర్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. గతంలో కూడా పలువురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇదీ చదవడి: చంద్రబాబుతో పంచాయితీ ఉండేదా?
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications