Lalu Prasad: శ్రీవారి సేవలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం..
ఆర్జేడీ అధినేత, మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి శనివారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న ఆయన శనివారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
లాలు ప్రసాద్ యాదవ్ దంపతుల వెంట కుమారుడు తేజస్వి యాదవ్, కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా లాలు ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో శిక్ష అనుభవించారు. కాగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు కంపార్ట్మెంట్లలో కాకుండా నేరుగా దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 54, 523 మంది భక్తులు దర్శించుకోగా 20,817 మంది తలనీలాలు సమర్పించుకున్నట్లు చెప్పారు.

-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications