వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమానం ఉంది: రోజా ధర్నా, వైసీపీ కార్యకర్త హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతిలో పదో తరగతి విద్యార్థి మోహన్ కృష్ణా రెడ్డి అనుమానాస్పద మృతి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురువారం ధర్నా చేపట్టింది. మోహన్ కృష్ణా రెడ్డి మృతి పైన చాలా అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తక్షణమే న్యాయ విచారమ జరిపించాలన్నారు. మంత్రి నారాయణ పైన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.

పరంధామ రెడ్డి, లక్ష్మీ దంపతుల కుమారుడు మోహన్ కృష్ణా రెడ్డి ఓ కార్పోరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత గురువారం పాఠశాల యాజమాన్యం ఆ బాలుని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రమాదవశాత్తు అద్దంపై పడటంతో గాయపడ్డాడని ఆసుపత్రిలో చేర్పించింది. మోహన కృష్ణరెడ్డి మృతి చెందాడు. దీనిపై విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా పాల్గొన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త దారుణ హత్య

Roja stage dharna in Tirupati

గుంటూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారు. జిల్లాలోని కారంపూడి మండలం చిన్నగార్లపాడులోని కార్యకర్త గోవింద రెడ్డి పైన ప్రత్యక్థులు దాడి చేశారు. దీంతో అతను మృతి చెందాడు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న 108 ఆంబులెన్స్‌ : ఇద్దరి మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం సమీపంలోని పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సును 108 ఆంబులెన్స్‌ ఢీకొనడంతో అంబులెన్స్‌ డ్రైవర్‌, రోగి మృతి చెందాడు. మర్రిపూడి నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

English summary
YSR Congress Party MLA Roja and Chevireddy Bhaskar Reddy staged dharna in Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X