పవన్ చాలా నేర్వాలి, చిరు ఏం చేశారో అందరికీ తెల్సు: ఫ్యాన్స్ అడిగితే సాయి షాక్
చిత్తూరు: తమ అభిమాన హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అభిమానులు కోరగా, వారికి మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సాయి ప్రతాప్ గురువారం ఝలక్ ఇచ్చారు. పవన్ది ఉడుకు రక్తమని వ్యాఖ్యానించారు.
ఈరోజు చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం అఢవినాయన చెరువు సమీపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని సమావేశంలో ఉన్న కొందరు పవర్ స్టార్ అభిమానులు అడిగారు. దీనిపై ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందిని చెప్పారు. ప్రత్యేక హోదా కావాలని నినదించడం సబబు కాదన్నారు. పవన్ సోదరుడు చిరంజీవి పార్టీ పెడితే ఏమైందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.
కాగా, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలుత తిరుపతిలో, ఆ తర్వాత కాకినాడలో, నవంబర్ 10వ తేదీన అనంతపురంలో సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయిప్రతాప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
-
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications