మరోసారి వివాదంలో రమణదీక్షితులు: సీనియర్ అర్చకుడి ఆగ్రహం
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు రమణదీక్షితులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై సీనియర్ అర్చకుడు ఖాద్రిపతి నరసింహాచార్యులు తీవ్రంగా మండిపడ్డారు. శ్రీవారి ఆలయంలో హోదా విషయంలో తాము రమణ దీక్షితుల
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు రమణదీక్షితులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై సీనియర్ అర్చకుడు ఖాద్రిపతి నరసింహాచార్యులు తీవ్రంగా మండిపడ్డారు. శ్రీవారి ఆలయంలో హోదా విషయంలో తాము రమణ దీక్షితులుకు సమానమేనని ఆయన అన్నారు.
గతంలో నిబంధనలకు విరుద్దంగా మనవడితో కలిసి నివేదన సమయంలో ఆలయ ప్రవేశం చేసినప్పుడు అధికారుల ఆదేశాల మేరకు లిఖితపూర్వక వివరణ ఇచ్చానని చప్పారు. రమణదీక్షితుల కుమారుల బదిలీ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసారు.

శ్రీవారి ఆలయంలో నిరంతరం పూజాకైంకర్యాలు నిర్వహించేది తామేనని చెప్పారు. తమను కించపరిచే విధంగా నిరంతరం వ్యాఖ్యలు చేస్తూ రమణదీక్షితులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. మిగిలిన ప్రధానార్చకులు విధులు కేటాయించే సమయంలో ఏ విధమైన వివాదాలు ఉండవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications