చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం: సీరియస్గా సీఎం చంద్రబాబు (ఫోటోలు)
విశాఖపట్నం: రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై ఆయన దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు.
విజిలెన్స్చే విచారణ చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినట్లు కలెక్టర్ స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలతో కూడా చర్చించినట్టు తెలియవచ్చింది. బుధవారం విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
విజిలెన్స్ విచారణ జరిగితే కానీ ఈ కుంభకోణానికి మూలమైన వైద్యఆరోగ్యశాఖ, ట్రెజరీ శాఖల్లో ఏ స్థాయి అధికారుల ప్రమేయం ఉందో.. ఎవరెవరు ఎంత స్వాహా చేశారో తేలే అవకాశాలు లేవు. ఇప్పటి వరకు తేలిన మొత్తం రూ.3.61కోట్లుమాత్రమే అయినప్పటికీ ఈ మొత్తం కనీసం రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో చలానాలు.. పే స్లిప్లతో జీతభత్యాల బట్వాడా జరిగేది.

చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం
రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై ఆయన దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు.

చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం
విజిలెన్స్చే విచారణ చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినట్లు కలెక్టర్ స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలతో కూడా చర్చించినట్టు తెలియవచ్చింది. బుధవారం విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం
విజిలెన్స్ విచారణ జరిగితే కానీ ఈ కుంభకోణానికి మూలమైన వైద్యఆరోగ్యశాఖ, ట్రెజరీ శాఖల్లో ఏ స్థాయి అధికారుల ప్రమేయం ఉందో.. ఎవరెవరు ఎంత స్వాహా చేశారో తేలే అవకాశాలు లేవు. ఇప్పటి వరకు తేలిన మొత్తం రూ.3.61కోట్లుమాత్రమే అయినప్పటికీ ఈ మొత్తం కనీసం రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో చలానాలు.. పే స్లిప్లతో జీతభత్యాల బట్వాడా జరిగేది.

చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం
ఆన్లైన్ అమలులోకి వచ్చాక నేరుగా సంబంధిత ఉద్యోగి అకౌంట్లోకి జమవుతుండడంతో అవతకవకలకు కొంత మేర బ్రేకుపడింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో పక్కదారి పట్టిన మొత్తమే రూ.3.61కోట్లుంటే కనీసం ఐదారేళ్లకు ముందు లోతైనదర్యాప్తు జరిపితే ఈమొత్తం ఏ స్ధాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటున్నారు.

చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం
ఈ కుంభకోణం వెలుగు చూసి నెల రోజులైంది. నిధులను పక్కదారి పట్టించడంలో చక్రం తిప్పిన చింతపల్లి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంట్, ఎస్టీవోలపై వేటు వేశారు. కానీ ఈ కుంభకోణం ద్వారా వైద్య ఆరోగ్యశాఖలో కోట్లు మింగిన ఘనులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఆ శాఖ ఉపక్రమించలేదు.

చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం
అంతర్గత విచారణతో కాలయాపన చేసిన ఆ శాఖాధికారులు ఈ అవినీతిలో ఎంతమంది ప్రమేయం ఉంది? ఏ స్థాయి అధికారుల భాగస్వామ్యం ఉందో మాత్రం నిగ్గు తేల్చలేకపోతున్నారు. ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకే ఆశాఖలో స్వాహాపరుల జాబితాను బయటకువిడుదల చేయడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.
ఆన్లైన్ అమలులోకి వచ్చాక నేరుగా సంబంధిత ఉద్యోగి అకౌంట్లోకి జమవుతుండడంతో అవతకవకలకు కొంత మేర బ్రేకుపడింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో పక్కదారి పట్టిన మొత్తమే రూ.3.61కోట్లుంటే కనీసం ఐదారేళ్లకు ముందు లోతైనదర్యాప్తు జరిపితే ఈమొత్తం ఏ స్ధాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటున్నారు.
ఈ కుంభకోణం వెలుగు చూసి నెల రోజులైంది. నిధులను పక్కదారి పట్టించడంలో చక్రం తిప్పిన చింతపల్లి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంట్, ఎస్టీవోలపై వేటు వేశారు. కానీ ఈ కుంభకోణం ద్వారా వైద్య ఆరోగ్యశాఖలో కోట్లు మింగిన ఘనులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఆ శాఖ ఉపక్రమించలేదు.
అంతర్గత విచారణతో కాలయాపన చేసిన ఆ శాఖాధికారులు ఈ అవినీతిలో ఎంతమంది ప్రమేయం ఉంది? ఏ స్థాయి అధికారుల భాగస్వామ్యం ఉందో మాత్రం నిగ్గు తేల్చలేకపోతున్నారు. ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకే ఆశాఖలో స్వాహాపరుల జాబితాను బయటకువిడుదల చేయడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.
పైగా ఇందులో ప్రత్యక్షంగా కోట్లుమింగిన ఉన్నతాధికారులను తప్పించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ ద్వారా విచారణ సాగుతోంది. విజిలెన్స్ విచారణ మొదలైతే కానీ కలుగులో దాక్కున్న అవినీతి ఎలుకలు బయటకొచ్చే అవకాశాల్లేవు.












Click it and Unblock the Notifications