వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి బాలికపై లైంగిక దాడి..ఆపై నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్..ఏపీలో దారుణం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను బెదిరించి ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమలాపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక పై లైంగిక దాడి చేసి, ఆపై నగ్న చిత్రాలను తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతంపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్ తో పాటుగా అతనికి సహకరించిన మరో 15 మందిపై కేసు నమోదు చేశారు.

 51 ఏళ్ళ వయసులోనూ లైంగిక వేధింపులు .. 66మంది మహిళలు, బాలికల ఫిర్యాదుతో యూపీ వ్యక్తి అరెస్ట్ 51 ఏళ్ళ వయసులోనూ లైంగిక వేధింపులు .. 66మంది మహిళలు, బాలికల ఫిర్యాదుతో యూపీ వ్యక్తి అరెస్ట్

కోరిక తీర్చకుంటే ఫ్యామిలీని చంపేస్తానని బాలికను బెదిరించిన ఇంజనీరింగ్ స్టూడెంట్

కోరిక తీర్చకుంటే ఫ్యామిలీని చంపేస్తానని బాలికను బెదిరించిన ఇంజనీరింగ్ స్టూడెంట్


వివరాల్లోకి వెళితే అమలాపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక పోటీ పరీక్షల శిక్షణ తీసుకోవడం కోసం గతంలో రాజమండ్రికి వెళ్ళింది .అక్కడ ఒక కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన మణి వెంకట సత్యనారాయణతో ఆ బాలికకు పరిచయమైంది . ఆ పరిచయంతో గతేడాది అక్టోబర్ 31వ తేదీన అమలాపురం వచ్చిన అతను ఒక లాడ్జిలో వారంపాటు మకాం వేసి బాలికను గుడికి రప్పించి మాట్లాడాడు. తన కోరిక తీర్చాలని బెదిరించాడు.

బాలికపై లైంగిక దాడి ..ఆపై ఆమె నగ్న చిత్రాలు తీసి బెదిరింపులు

బాలికపై లైంగిక దాడి ..ఆపై ఆమె నగ్న చిత్రాలు తీసి బెదిరింపులు


తన కోరిక తీర్చకపోతే ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి బాలికపై లైంగికదాడి చేశాడు. ఆపై ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఆమె నగ్న చిత్రాలను తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక మానసికంగా కుంగి పోయింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ,కొవ్వూరులోని యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. అయినప్పటికీ ఆ యువకుడి లో ఎలాంటి మార్పు లేకపోవడంతో రాజాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 పోక్సో చట్టం క్రింద కేసు నమోదు.. సహకరించిన స్నేహితులపై కూడా కేసు , అందులో యువతులు

పోక్సో చట్టం క్రింద కేసు నమోదు.. సహకరించిన స్నేహితులపై కూడా కేసు , అందులో యువతులు

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు ఈ కేసును బదలాయించారు. ఇక ఈ కేసును కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. నిందితుడికి సహకరించిన 15 మంది పై కూడా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే నిందితుడికి సహకరించిన వారిలో విద్యార్థినులు కూడా ఉన్నారట.
బాలికపై లైంగిక వేధింపులకు ఆ యువకుడికి విద్యార్థినులు కూడా సహకరించటం శోచనీయం .

English summary
The worst incident took place in the state of Andhra Pradesh. The incident where an engineering student threatened a minor girl and sexually assaulted her came to light recently. Police have registered a case under the Pocso Act against a 17-year-old girl from Amalapuram area for sexually assaulting her and then taking nude pictures and blackmailing her, along with engineering student cases filed on 15 others who had collaborated with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X