టీడీపీలోకి వెళ్లే నేతను వైసీపీలోకి లాగేసిన జగన్..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్ది పార్టీలు మారే నేతల సంఖ్య ఎక్కువైంది. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు తమ పార్టీల నుంచి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దీనిలో భాగంగానే వైసీపీ నుంచి టీడీపీలో చేరాలని చూసిన ఓ నేతకు సీఎం జగన్ బ్రేకులు వేశారు. ఆ నాయకుడు మరెవ్వరో కాదు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. ఆయన ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. టికెట్ దక్కకపోవడంతో శిద్దా రాఘవరావు టీడీపీలో చేరడానికి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ నుంచి శిద్దా రాఘవరావుకు పిలుపు రావడంతో ఆయన టీడీపీలో చేరిక వాయిదా పడిందని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించరాయన. 2014లో టీడీపీ , బీజేపీ ఉమ్మడి అభ్యర్దిగా పోటీ చేసిన శిద్దా రాఘవరావుకు జనసేన మద్దతు లభించడంతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా లభించాయి. దీంతో ఇక్కడ శిద్దా రాఘవరావు గెలుపుసాధ్యమైంది.2019 ఎన్నికల్లో అనూహ్యంగా శిద్దా రాఘవరావును టీడీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంట్కు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయించింది.

ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు ఆ తరువాత అధికారపార్టీ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో దర్శి టికెట్ ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. టికెట్ వేరే వారికి కేటాయించడంతో..శిద్దా రాఘవరావు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.ఈ సమయంలో సీఎం జగన్ నుంచి ఆయనకు పిలుపు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పార్టీ మారే ఆలోచనలో ఉన్న శిద్దాను వైసీపీ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది . శిద్దా రాఘవరావు సీఎం జగన్ను కలవడంతో పరిస్థితులు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. సీఎం జగన్తో భేటీ అనంతరం శిద్దా రాఘవరావు మనుస్సు మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అద్దంకి, ఒంగోలు, మార్కాపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని శిద్దాకు సూచించినప్పటికీ ఆయన అంగీకరించలేదని..ఆయన దర్శి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపించారని.. అప్పటికే దర్శి టికెట్ వేరే వారికి కేటాయించడంతో శిద్దాకు సీటు దక్కలేదు. అంతేకాని ఆయన్ను ఎక్కడా కూడా అవమానించలేదని.. జగన్తో మాట్లాడిన తరువాత ఆయన కచ్చింతంగా వైసీపీలోనే కొనసాగతారని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం జగన్తో భేటీ తరువాత శిద్దా రాఘవరావు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications