కడప కార్పొరేషన్లో చూడకూడని దృశ్యాలు: రాసలీలలపై సిబ్బంది అసహనం!
ఉద్యోగుల సౌకర్యం కోసం కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన కడప మున్సిపాలిటీని లక్షల రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లతో నవీకరించింది ప్రభుత్వం. అయితే, కొందరు ఉద్యోగులు తమకు వేర్వేరుగా ఉన్న ఛాంబర్లలో .
కడప: ఉద్యోగుల సౌకర్యం కోసం కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన కడప మున్సిపాలిటీని లక్షల రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లతో నవీకరించింది ప్రభుత్వం. అయితే, కొందరు ఉద్యోగులు తమకు వేర్వేరుగా ఉన్న ఛాంబర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులను, ఇతర మహిళలను లొంగదీసుకుని కార్యాలయంలోనే కామ కలాపాలు సాగిస్తున్నారనే వార్తలు నగర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
కార్పొరేషన్ కార్యాలయంలోని గ్రౌండ్ఫ్లోర్లో రెండు చాంబర్లలో, రెండవ అంతస్తులోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక చాంబర్లో రాసలీలలు సాగుతున్నట్లు పలువురు కార్యాలయ ఉద్యుగులే వెల్లడించడంతో ఈ వార్త బహిరంగ రహస్యంగా కొనసాగుతోంది. మూడు చాంబర్లలో ఇద్దరు అధికారులు, ఒక జూనియర్ అసిస్టెంట్ రాసక్రీడలను సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో చాంబర్ల పక్కన పనిచేస్తున్న ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారినట్లు తెలిసింది.

రాసక్రీడలు
ఒక్కొక్కసారి ఏదైనా పనిమీద చాంబర్లోకి వెళ్లినపుడు సహోద్యోగులకు రాసక్రీడల దృశ్యాలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. దీంతో వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారట. అంతేగాక, కడప కార్పొరేషన్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి చాంబర్లో యాంటీరూంను ఏకంగా బెడ్రూమ్గా మార్చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో..
సాధారణంగా కార్యాలయం పనుల మీద కమిషనర్ హైదరాబాదు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ సమయాల్లో కొంతమంది ఉద్యోగులు కమిషనర్ చాంబర్ తాళాలను డూప్లికేట్ చేసుకుని వాటితో తెరచి యాంటిరూమ్లోకి ప్రవేశించి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు తెలిసింది.

వాడుకుంటున్నారు..
రాసలీలలు నడిపే ఉద్యోగులు కార్యాలయంలో దిగువస్థాయి సిబ్బందిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక, వారికి క్వార్టర్ మద్యం, రూ.200 నగదు ఇస్తే అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సహోద్యోగులు బహిరంగంగా చెబుతుండటం గమనార్హం.

ఎంతో జాగ్రత్తగా..
కార్యాలయంలో ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు కమిషనర్ దృష్టికి వెళ్లకపోవడం గమనార్హం. అంటే, రాసలీల ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా తమ పనిని చక్క బెట్టుకుంటున్నారో అర్థమవుతుందని ఉద్యోగులు అంటున్నారు. తమ కంటే ఉన్నత పదవుల్లోని ఈ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కార్యాలయంలోని సిబ్బంది కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications