వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ బృందంతో జగన్ నేతల భార్యలు: టిడిపి ప్రశ్నలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల సతీమణులు రాష్ట్రపతిని కలవడం ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసమే వారు ఢిల్లీ పెద్దలను కలిశారని ఆరోపించారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకుల సతీమణులు భర్తలకు తెలియకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలను సీమాంధ్రలో అడ్డుకుంటుంటే వారి సతీమణులతో కలిసి ఎలా వెళ్లారని ప్రశ్నించారు.

విభజన విషయంలో సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకే కాంగ్రెసు పార్టీ ఆంటోని కమిటీని వేసిందని, ఇక్కడి ప్రజలను మెప్పించేందుకు ఏం కమిటీ వేస్తారని ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, కాంగ్రెసు నేతల భార్యలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల భార్యలు ఒకే లేఖపై సంతకాలు చేయడమే ఇందుకు నిదర్శనమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. ఇటలీ మాఫియాకు, ఇడుపులపాయ మాఫియాకు లింకుందన్నారు. జగన్ బెయిల్ కోసం కడప పౌరుషం నీరుగారిందని మండిపడ్డారు.

English summary
Telugudesam Party senior leader Somireddy Chandramohan Reddy on Sunday questioned why YSRCP Party leaders wives met President along with Congress Party leaders wives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X