చంద్రబాబుకు మోడీ ఫోన్, కెసిఆర్ దిగ్భ్రాంతి, కొందరి మృతుల వివరాలు...
హైదరాబాద్/రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద జరిగిన ప్రమాదం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాటలో 22 మంది భక్తులు మృతి చెందారు. భక్తుల మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు గోదావరి తల్లి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
బాబుకు ప్రధాని మోడీ ఫోన్
I spoke to CM @ncbn & discussed the situation with him. The State Government is working to restore normalcy.
— Narendra Modi (@narendramodi) July 14, 2015 ప్రమాద ఘటన పైన ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి, సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకు మోడీ ఫోన్, కెసిఆర్ దిగ్భ్రాంతి, కొందరి మృతుల వివరాలు...
Deeply pained at the loss of lives due to stampede at Rajahmundry. My condolences to the families of the deceased & prayers with the injured
— Narendra Modi (@narendramodi) July 14, 2015 మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరాంధ్రవారు
It is regrettable that lives are lost in stampede at Rajahmundry Ghat. Request people not to panic. Situation brought under control. (1/3)
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్రకు చెందిన వారు ఉన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 22మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు.
I request to people to head to other Pushkar ghats to avoid overcrowding at single ghat. I'm monitoring situation from control room. (2/3)
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2015 తక్కువ రద్దీ ఉన్న ఘాట్లకు వెళ్లాలి
భక్తులు తక్కువ రద్దీ ఉన్న ఘాట్లకు వెళ్లాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. ఘాట్ల వద్ద వరుస పాటించాలని విజ్ఞప్తి చేశారు. కోటగుమ్మం, కోటి లింగాలు మినహా మిగతా ఘాట్లకు వెళ్లాలని కోరారు. కాగా, ప్రమాదం జరిగిన ఘాట్ చిన్నగా ఉన్నట్లగా తెలుస్తోంది.
Request people to follow queues lines & instructions. Pilgrims' safety is top priority for us. Will provide all possible assistance. (3/3)
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2015 మృతుల్లో 13 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రులను రాజమండ్రి ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి కామినేని శ్రీనివాస్ను బాధితులు చుట్టుముట్టారు.
CM expressed deep condolences at the tragic loss of lives in stampede incident at Rajahmundry Pushkar Ghat.
— Telangana CMO (@TelanganaCMO) July 14, 2015 మృతులు, క్షతగాత్రుల్లో కొందరు...
మృతులు...
రుద్రరాజు లక్ష్మి (పశ్చిమ గోదావరి జిల్లా యండగండి, 65 ఏళ్లు)
పార్వతమ్మ (విజయనగరం జిల్లా బాడంగి)
గొర్లె మంగమ్మ (విశాఖ జిల్లా పెందుర్తి)
పైడితల్లి (విజయనగరం జిల్లా పాల్తేరి)
కృష్ణవేణి ( తూర్పు గోదావరి జిల్లా వేమగిరి)
క్షతగాత్రులు... కృష్ణయ్య, రత్నం (యానాం)
వెంకట లక్ష్మి (రాజమండ్రి)
కృష్ణవేణి (విజయవాడ)
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications