నాలుగు వారాలు ఆగు ఉమా ... నీ బండారం బయటపడుతుంది .. విజయసాయి ట్వీట్
తన ట్వీట్ ల ద్వారా ప్రత్యర్ధులకు చెమటలు పట్టించే విజయసాయి రెడ్డి ఈ సారి దేవినేని ఉమను టార్గెట్ చేశారు. మొన్నటికి మొన్న చంద్రబాబుపై విరుచుకుపడిన విజయసాయి రెడ్డి తాజాగా దేవినేని ఉమా బాగోతం త్వరలో బయట పడుతుంది అని ట్వీట్ చేశారు.

మరో నాలుగు వారాలు ఓపిక పడితే, నీటి పారుదల శాఖలో దేవినేని ఉమ నడిపించిన అరాచకం బయటకు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగు వారాలు ఓపిక పట్టు ఉమా అంటూ దేవినికి హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "మరో నాలుగు వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్లర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు. పోలవరం, హంద్రీ నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?" అని విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్లర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 26, 2019












Click it and Unblock the Notifications