చిత్తూరులో వింత శిశువు జననం: చూసేందుకు క్యూ కట్టిన ప్రజలు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనేపల్లెలో ఓ వింత శిశువు జన్మించింది.అవయవాలు బయటకు వచ్చిన చిన్నారికి చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.తేనేపల్లె ఎస్సీకాలనీకి చెందిన వెంకటేష్ భార్య కుమారి ఆ
Recommended Video
వింత
శిశువు
జననం
:
అంతా
బాగానే
ఉ
న్నా
అక్కడ
చర్మం
లేదు
|
Oneindia
Telugu
చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనేపల్లెలో ఓ వింత శిశువు జన్మించింది. అవయవాలు బయటకు వచ్చిన చిన్నారికి చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
తేనేపల్లె ఎస్సీకాలనీకి చెందిన వెంకటేష్ భార్య కుమారి ఆదివారం ఓ వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే పొట్ట భాగంలో పెద్దగడ్డ, తొడ కింది భాగంలో ఎర్రటి గడ్డలాంటి అవయవాలు బయటకు వచ్చి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
దీంతో వైద్య చికిత్సలు చేయించేందుకు తిరుపతి స్విమ్స్కు వెళ్లారు. అక్కడి వైద్యులు శిశువును పరీక్షించి వైద్యం చేయలేమని తేల్చిచెప్పారు.
దీంతో ఏం చేయాలో తోచని వెంకటేష్, కుమారి దంపతులు నిరాశతో ఇంటికి వచ్చారు. కాగా, వింత శిశువును చూడటానికి సమీప గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.
Comments
English summary
Strange baby born in Chittoor.
Story first published: Monday, September 25, 2017, 19:32 [IST]