టి, ఏపి సిఎంలు మాట్లాడుకోవాలి: పరిటాల సునీత
కర్నూలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే శ్రీశైలం జల వివాదానికి పరిష్కారం లభిస్తుందని ఏపి పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అభిప్రాయపడ్డారు. మంత్రి సునీత కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. జలాశయం అధికారులను నీటిమట్టాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అర్హులకు పింఛన్: గంటా
విశాఖపట్నం: అర్హులైన పేదలందరికీ పింఛన్ అందిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందజేశారు.

జాబితాలో పేర్లు గల్లంతైన వారు మరోసారి దరఖాస్తు చేసుకుంటూ పింఛన్ మంజూరు చేస్తామని గంటా శ్రీనివాస రావు తెలిపారు. అనర్హులపై మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు.
రైతులకు మంచి ప్యాకేజి: సుజనాచౌదరి
కృష్ణా: రాజధాని కోసం సేకరించే భూముల యజమానులైన రైతులకు మెరుగైన ప్యాకేజీ అందజేస్తామని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజానా చౌదరి అన్నారు. తాము ఇచ్చే ప్యాకేజీతో రైతులు సంతోషంగా భూములు ఇచ్చే విధంగా చేస్తామని తెలిపారు.
పోరంకిలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమంలో ఎంపి సుజనాచౌదరి పాల్గొన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకోమని స్పష్టం చేశారు. రైతు సాధికార సంస్థకు మరో 2వేల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు తెలిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications