జ్ఞానేశ్వరి కేసులో పోలీసుల సంచలన ప్రకటన!

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 25 రోజులు గడిచినా ఆమె ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఘటన మరింత మిస్టరీగా మారుతోంది. ప్రారంభం నుంచి కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు.

చిన్నారి కనిపించకుండా పోయిన వెంటనే తుని రూరల్ పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేసి విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు కోసం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాకినాడ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోనూ అన్వేషణ కొనసాగిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలు, పొలాలు, కాలువలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను జల్లెడ పట్టారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Sunkara Jnaneswari Disappearance Mystery Kakinada Tuni Police Offer Cash Reward To Find Missing Girl

ఎలాంటి చిన్న సమాచారం వచ్చినా..

దర్యాప్తులో భాగంగా చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పరిచయస్తులు, సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన పలువురిని పోలీసులు విచారించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ సమాచారం వంటి అంశాలను కూడా పరిశీలిస్తూ అన్ని అవకాశాలను పరిశోధిస్తున్నారు. ఎలాంటి చిన్న సమాచారం వచ్చినా వెంటనే ధృవీకరిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు.

జ్ఞానేశ్వరి కోసం NDRF హైఅలర్ట్ ఆపరేషన్! క్షణక్షణం ఉత్కంఠ..
జ్ఞానేశ్వరి కోసం NDRF హైఅలర్ట్ ఆపరేషన్! క్షణక్షణం ఉత్కంఠ..

ఎన్డీఆఫ్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ స్పష్టమైన ఆధారం దొరకకపోవడంతో పోలీసులు ఇప్పుడు ప్రజల సహకారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. చిన్నారి ఫొటో, వివరాలతో కూడిన గోడపత్రికలను కాకినాడ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతికిస్తున్నారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేసి ఎవరైనా చిన్నారిని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రూ. లక్ష పారితోషికం..

చిన్నారి జాడ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు పారితోషికం అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మరింత మంది నుంచి ఉపయోగకరమైన సమాచారం లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు ఆశను వదులుకోకుండా ప్రతి రోజూ ఆమె క్షేమంగా తిరిగి వస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే తెలియజేస్తున్నారు. చిన్నారి అదృశ్యం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఆమె ఆచూకీ త్వరగా లభించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

జ్ఞానేశ్వరి కేస్‌లో ఊహించని ట్విస్ట్! జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే..
జ్ఞానేశ్వరి కేస్‌లో ఊహించని ట్విస్ట్! జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే..

సుంకర జ్ఞానేశ్వరి గురించి ఎవరైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే తుని రూరల్ పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. సమాచారం అందించేందుకు 9440796508, 9440796531, 9440796573 ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. చిన్నారి ఆచూకీకి దారితీసే ప్రతి సమాచారం కీలకమని, ప్రజల సహకారమే దర్యాప్తుకు బలమని పోలీసులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+