పవన్ పై ముద్రగడ ఆలోచనలో మార్పు - ఢిల్లీ ఎఫెక్ట్..!?
ఏపీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు ఓకే అయినట్లు చెబుతున్నా సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీ ఇతర పార్టీల కంటే ఎన్నికల యుద్దంలో వేగంగా కదులుతోంది. టీడీపీ, జనసేన అభ్యర్దుల ఎంపిక కొలిక్కి రాలేదు. బీజేపీ నిర్ణయం కోసం ఈ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. అటు పొత్తుల చర్చలు చేస్తూనే..బీజేపీ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. కాపు ఉద్యమ నేత ముదగ్రడ జనసేనలో చేరటం ఖాయమని భావించిన వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
మారుతున్న లెక్కలు : ఈ సారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలు కీలకం కానున్నాయి. ఉభయ గోదావరిలో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీకే అధికారం ఖాయమనే నమ్మకం ఉంది. ఇక్కడ పవన్ సహకారంతో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. జనసేన ఇక్కడే ఎక్కువ సీట్లు పొత్తులో తీసుకోవాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందనే దిశగా కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ, బీజేపీ విషయం తేల్చకుండా పెండింగ్ లో పెట్టింది. దీంతో, రెండు పార్టీల అభ్యర్దుల ఖరారు ప్రక్రియ ముందుకు కదలటం లేదు. గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో, ఎవరికి సీట్లు దక్కుతాయనే ఉత్కంఠ రెండు పార్టీలోనూ కనిపిస్తోంది.

ముద్రగడ ఎటువైపు : ఇదే సమయంలో ముద్రగడ రాజకీయ ప్రయాణం పైన తూర్పు గోదావరిలో చర్చ మొదలైంది. 2014 నుండి ఏ పార్టీ లోనూ చేరకుండా ఉండిపోయిన ముద్రగడ పద్మనాభంతో జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చర్చలు జరిపారు. పవన్ స్వయంగా వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే చర్చ జరిగింది. కానీ, ముద్రగడ ఎంట్రీ పైన ఇంకా స్పష్టత రాలేదు. ముద్రగడ చేరిక విషయాన్ని పవన్ ప్రస్తుతానికి పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడ ను పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా కాపు ఓటింగ్ బ్యాంకు మరింత బలోపేతం అవుతుందని అంచనా వేసారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ తో పాటు, ఆయన కుమారుడు ముద్రగడ గిరికి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. కానీ, అనూహ్యంగా ముద్రగడ చేరిక అంశం ఆగిపోయింది.

కొత్త సమీకరణాలు : ముద్రగడతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. దీని కారణంగానే ముద్రగడతో భేటీకి పవన్ దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ముద్రగడ మౌనం వెనుక కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులే కారణమని సమాచారం. టీడీపీ, జనసేన పొత్తలో భాగంగా సీట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవటంతో ముద్రగడకు పవన్ ఎలాంటి హామీ ఇవ్వలేక ఆయన వద్దకు వెళ్లలేదనేది మరో వాదన. అయితే, ఇప్పుడు గోదావరి జిల్లాలో మారుతున్న సమీకరణాలు.. ముద్రగడ చేరిక పైన కొనసాగుతున్న సస్పెన్స్ తో గోదావరి తీరాన రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications