శ్వేతాబసు ప్రకటన కాదా? బాధితురాలే, అరెస్ట్ కాదు
హైదరాబాద్: వ్యభిచార కూపంలోకి వెళ్లడం పైన శ్వేతాబసు వివరణ ఇచ్చినట్లుగా బుధవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆ ప్రకటన విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంది. అక్కడ ఉన్న ఆమె ఎలాంటి ప్రకటన విడుదల చేసేందుకు అవకాశం లేదని పోలీసులు చెప్పినట్లుగా సమాచారం.

న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసిన అనంతరం ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచామని, దీనిని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నడుపుతోందని పోలీసులు తెలిపారని తెలుస్తోంది. అక్కడే ఆమె మరికొద్ది రోజులు ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో ఆమె ఎలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని, మీడియాతో మాట్లాడే అవకాశం లేదని పోలీసులు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, నాలుగు రోజుల క్రితం శ్వేతాబసు వ్యభిచార కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. పోలీసులు ఆమెను అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరు పర్చారు. అనంతరం రెస్క్కూ హోంకు తరలించారు.
మరోవైపు, రిహాబిలేషన్ సెంటర్కు తరలించిన శ్వేతాబసుది అరెస్టు కాదని పోలీసులు చెప్పారని తెలుస్తోంది. ఈ కేసులో శ్వేతాబసు బాధితురాలని చెప్పారు. రెస్క్యూ హోంకు తరలించే ముందు ఆమెను ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్సకు పంపించినట్లు చెప్పారు. కాగా, ఈ రెస్క్యూ హోంలో ఆమె మూడు నెలలు ఉంటుందని తెలుస్తోంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications