‘ఆయన నరమేధం సాగించారు’: తమ్మినేని ధ్వజం
శ్రీకాకుళం: సిఆర్డిఏ అధికారి శ్రీకాంత్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు ఉల్లంఘించడంలో శ్రీకాంత్ ఘనుడని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాలపై పరువు నష్టం దావా వేస్తామంటూ శ్రీకాంత్ బెదరించడం సరికాదని తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు కలెక్టర్గా వ్యవహరించిన సమయంలో సోంపేట, కాకరాపల్లి ప్రాంతాల్లో ఆయన నరమేధం సాగించారని ఆరోపించారు. ఇంతకాలం శ్రీకాంత్ చేసిన చట్ట ఉల్లంఘనలపై కోర్టుకు, ప్రజలకు కూడా తాము నివేదిస్తామని తమ్మినేని సీతారాం ష్పష్టం చేశారు.
బీసీలను కరివేపాకుల వాడుకుంటున్నారు: ఉదయ్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పట్ల అనుసరిస్తున్ వైఖరిపై ఆ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి ఉదయ్ కుమార్ గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను చంద్రబాబ కరివేపాకులా వాడుకుంటున్నారని అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను ఎన్నికల ముందు తెలంగాణ సిఎం చేస్తానని చెప్పి.. ఎన్నికల తర్వాత ప్రతిపక్షనేతగా కూడా చేయలేదని విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు.