షాకింగ్: 'వైయస్ వివేకానంద ఓటు తొలగించిందే జగన్, ఎందుకంటే, ఫారం 7 విషయంలోనూ..'
అమరావతి: డేటా చోరీ, ఓట్ల గల్లంతు అంశంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దొంగ ఓట్లతో గెలవాలని టీడీపీ అనుకుంటోందని వైసీపీ చెబుతుండగా, తెరాస సహకారంతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ అంటోంది. ఓట్ల తొలగింపుపై తామే ఫిర్యాదు చేశామని ఇప్పటికే జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం నడుస్తోంది.

వైయస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించిందే జగన్
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేతపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత నేత సతీష్ రెడ్డి అన్నారు. తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి ఓటును తొలగించారని జగన్ చెప్పారని, కానీ ఆయన ఓటు జగనే అని ఆరోపించారు. వివేకా ఓటు తొలగించి జగన్ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. జగన్కు ఆయన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి ఓటు వేస్తారనే నమ్మకం లేదని, అందకే తొలగించారన్నారు. ఫారం 7 ద్వారా ప్రజల ఓట్లు తొలగించమని చెప్పడానికి జగన్ ఎవరన్నారు. జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘo సుమోటోగా స్వీకరించాలన్నారు.

సీఎం కుర్చీ కోసం ఎన్ని అనర్థాలైనా చేయగలడు
ఓటర్ లిస్ట్ నుంచి ఓట్లను అక్రమంగా తొలగించే కుట్రపై వైసీపీ నేతలను ప్రజలు ఎక్కడికి అక్కడ నిలదీస్తున్నారని మంత్రి దేవినేని ఉమా వేరుగా అన్నారు. ఫారం 7 ద్వారా నకిలీ దరఖాస్తులతో ఓట్లు తొలగించే కుట్రకు వైసీపీ పాల్పడుతోందన్నారు. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశామని, తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీతో చేతులు కలిపి జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సీఎం కుర్చీ కోసం ఎన్ని అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్ అన్నారు.

ఫారం 7 ఎఫెక్ట్.. జగన్పై ఈసీ చర్యలు తీసుకోవాలి
ఏపీలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే కుట్రలకు పాల్పడుతున్నారని దేవినేని అన్నారు. అందుకే కులాలు, మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. అధికారమే పరమావధిగా జగన్ మాట్లాడుతున్నారని, ఫారం 7 ద్వారా తానే దరఖాస్తు చేయించానని జగన్ అంగీకరించారని, జగన్ ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. ఏపీలో 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర పన్నారని, నెల్లూరు సభలో జగన్ మాట్లాడిన భాష జుగుప్సాకరమన్నారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications