విషాదం.. దేవినేని నెహ్రూ కన్నుమూత, బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5.20 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఆయన కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. నెహ్రూ 5సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంకిపాడు నుంచి 4సార్లు, విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 1994 నుంచి 1996 వరకు మంత్రిగా పని చేశారు. విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు. ఇప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున టిడిపి నేత గద్దె రామ్మోహన రావుపై పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబట్టింది లేదు. కానీ రాజకీయాల్లో ఉండాలంటే ఏదో పార్టీ ఉండాలి కాబట్టి అలాగే ఉండిపోయారని అంటారు.
కానీ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారని చెబుతుంటారు. 2004లో గెలిచినా మంత్రిగా కాలేదు. కృష్ణా జిల్లాకే పరిమితం అయ్యేవారు. 2014లో మాత్రం ఓడిపోయారు. అనారోగ్యం కారణంగా దేవినేని నెహ్రూ తన కొడుకును రాజకీయాల్లోకి ప్రధానంగా తెరపైకి తీసుకు వచ్చారు.
నెహ్రూకు కూతురు, కొడుకు ఉన్నారు. దేవినేని నెహ్రూ మృతి చెందిన విషయం తెలిసిన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తనయుడు దేవినేని అవినాష్, కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications