రూ.2 వేల కోట్లు కాదు.. రూ.51 వేలే, శ్రీనివాసరావు వద్ద మొత్తం ఇదేనంటోన్న జ్యోతుల నెహ్రూ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఓ రేంజ్లో ఫైరయయారు. ఐటీ దాడులు గురించి ప్రధానంగా నెహ్రూ ప్రస్తావించారు. ఐటీ దాడులు అభూత కల్పన అని కొన్ని కథనాలు రాస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సత్యదూరం...
టీడీపీ, చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయని.. కానీ తెలుగురాష్ట్రాల్లో జరిగినట్టు మీడియాలో చూపిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద దొరికింది రూ.51 వేలు అని క్లారిటీ ఇచ్చారు. కానీ రూ.2 వేల కోట్లు శ్రీనివాస్ వద్ద పట్టుబడినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. మొత్తం వ్యవహారంలో వైసీపీ నేతలు తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఒక్కటి కూడా నిలవలేదు..
ఈడీ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ వాటిని పారదర్శకంగా వ్యవహరించాలని జ్యోతుల నెహ్రూ సూచించారు. వైఎస్ హయాంలో తానేమి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సూచించారు. చంద్రబాబుపై అధికార పార్టీ 26 ఆరోపణలు చేశారని.. ఏ ఒక్కటి నిరూపించలేకపోయిందని చెప్పారు. కొన్ని కేసులను జగన్ వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ వైసీపీ మాత్రం నిరాధార ఆరోపణలతో టీడీపీ పేరు బాదనం చేసే ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ముఠా
కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతిపరులకే కాంట్రాక్టులు ఇస్తున్నారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.750 కోట్లు మిగిలాయని చెబుతున్నారు.. ఇసుక పేరుతో రూ.500 కోట్లు దోచారని జ్యోతుల ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి జగనే కారణం అని విమర్శించారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని అదో ముఠా అని.. వైసీపీ నేతలు నీతులు వల్లించే ముందు.. తమ నోటిని శుద్ది చేసుకోవాలని సూచించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications