కడప జిల్లాలో టిడిపి నేత హత్యతో రాజకీయ రణం...ప్రొద్దుటూరు నుండి లోకేష్ పోటీ చెయ్యాలని ఎమ్మెల్యే రాచమల్లు సవాల్
కడప జిల్లాలో టిడిపి నేత సుబ్బయ్య హత్యతో రాజకీయ రణం మొదలైంది . ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డి టీడీపీ నేత సుబ్బయ్య హత్యకు కారణమని టిడిపి ఆరోపిస్తోంది. సుబ్బయ్య భార్య అపరాజితతో పాటుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వైసీపీ నేతలే హత్యకు కారణమని మండిపడుతున్నారు.ఇక ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే నారా లోకేష్ కు సంచలన సవాల్ ను చేశారు.

లోకేష్ ప్రొద్దుటూరు నుండి తనపై పోటీ చేసి గెలవాలని సవాల్
టిడిపి నేత సుబ్బయ్య హత్యకు వైసిపి ఎమ్మెల్యే కారణమంటూ చేసిన వ్యాఖ్యలపై , అతని పేరుమీద ఎఫ్ ఐ ఆర్ చేయాలని చేసిన డిమాండ్ పై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు.నియోజకవర్గం నుండి నారా లోకేష్ పోటీ చేయాలని లోకేష్ ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తానంటే రాజీనామా చేస్తారంటూ ప్రకటించారు. తనపై పోటీ చేసి లోకేష్ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల వదిలేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.

హత్యపై ప్రజాభిప్రాయం కోరదాం .. పోటీ చేస్తానంటే రాజీనామా చేస్తా
నేను టిడిపి నేత సుబ్బయ్య ను హత్య చేయించానని, హత్య చేసేందుకు ప్రోత్సహించానని నువ్వు నమ్మితే నీకు సవాల్ విసురుతున్నా అంటూ పేర్కొన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ హత్య అంశంపై పొద్దుటూరు ప్రజల అభిప్రాయం సేకరిద్దాం . నువ్వు ఇక్కడ పోటీ చేస్తానంటే నేను రాజీనామా చేస్తా.. పోటీలో పాల్గొందామంటూ పేర్కొన్నారు. టిడిపి నేత సుబ్బయ్య ను ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి హత్య చేశాడని, అతనిని ఓడించాలని మీరు ప్రజల్లోకి వెళ్లండి. నేను కూడా ఈ హత్యతో నాకు సంబంధం లేదని ప్రజలు ఓటు వేయాలని కోరతానన్నారు.

ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా
ఒకవేళ నేను ఓటమి పాలైతే ఆ మరుక్షణమే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా... ఊరు వదిలి వెళ్లిపోతాను అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నారా లోకేష్ కు చాలెంజ్ విసిరారు. ఇప్పటికే ఆయన టిడిపి నేత హత్యతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రొద్దుటూరు చౌడేశ్వరి ఆలయంలో సత్య ప్రమాణం కూడా చేశారు.
ఇదే సమయంలో మృతుడు సుబ్బయ్య భార్య కూడా తన పిల్లల మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే పై , ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డిపై ఆరోపణలు చేశారు .
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications