అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు అసాధ్యం ! యనమల కీలక వ్యాఖ్యలు..
అమరావతి : రేపు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు ఐదు రోజుల పాటు జరుగుతాయని భావిస్తున్న ఈ సమావేశాల్లోనే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టి ఆమోదిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనవ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజధాని మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టిన విషయాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. తాజాగా ప్రభుత్వం మరోసారి మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడుతుందని యనమల ప్రశ్నించారు.
వైసీపీ సర్కార్ ప్రజా సమస్యల్ని వదిలిపెట్టి వ్యక్తిగత అజెండాపై దృష్టిసారిస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా... తిరిగి మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తుండాన్ని యనమల ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదన్నారు.

ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులోనూ పెండింగ్ లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో హైకోర్టు తీర్పును ఉల్లంఘించాలనుకోవడం మూర్ఖత్వమని యనమల తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ పరంగా పెట్టాలి కాబట్టి పెడుతున్నారు తప్ప ప్రజాసమస్యల కోసం కాదన్నారు. అమరావతిపై అవగాహన లేని ఒక్కో మంత్రి ఒక్కో పొంతన లేని ప్రకటన చేస్తున్నారని యనమల విమర్శించారు. దీనిపై చర్చకు టీడీపీ ఎప్పుడూ సిద్ధమేనని యనమల తెలిపారు. చర్చకు రాలేకే వైసీపీ మంత్రులు తమను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ధరల పెరుగుదల, అమరావతి, పోలవరం, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం వంటి అనేక ప్రజాసమస్యలపై ఈ సమావేశాల్లో అసెంబ్లీ, మండలిలో చర్చకు పట్టుబడతామని యనమల తెలిపారు. ప్రజా సమస్యలు లేవనెత్తితే సస్పెండ్ చేస్తామనే ధోరణి ప్రభుత్వానికి సరికాదని యనమల అన్నారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications