అదంతా నిజం కాదు: దెబ్బకు చంద్రబాబు వద్దకు ఎమ్మెల్యేల క్యూ!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎమ్మెల్యేలకు, మంత్రులకు గ్రేడ్లు ఇచ్చారు. ఇవి కలకలం రేపిన విషయం తెలిసిందే. తక్కువ ర్యాంకులు వచ్చిన నేతలు ఇప్పుడు ఆయనను కలిసి వివరణ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. తాము ఎలాంటి తప్పులు చేయలేదని చెబుతున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారికి క్లాస్ తీసుకుంటున్నారని సమాచారం. తప్పులు దిద్దుకొని సరిగా నడుచుకోవాలని సూచిస్తున్నారని సమాచారం. సీల్డ్ కవర్లో చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు చూసి పలువురు నేతలు కలవరపడుతున్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు మరింత కంగారుపడి, వివరణ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ వర్క్ షాప్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇంచార్జులకు ర్యాంకులకు చెందిన సీల్డ్ కవర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వారి పనితీరుకు గ్రేడ్లు కూడా కేటాయించారు.
పలువురు ఎమ్మెల్యేలకు గ్రేడ్ల విషయంలో పెద్దగా టెన్షన్ లేదని, కానీ తమ గురించి పేర్కొన్న సమాచారం విషయమై మాత్రం ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. అవినీతి, దందాలు, ఇసుక తవ్వకాలలో అక్రమాలు.. తదితర సంబంధాలు ఉండటంతో కొందరు ఆందోళన చెంది, వివరణ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది.

నివేదికలో పేర్కొన్న అంశాల్లో నిజం లేదని, తమకు సంబంధం లేని విషయాలు ఉన్నాయని, అలాంటి పొరపాట్లేవీ తాము చేయలేదని చెబుతున్నారట. వారు చెప్పింది వింటున్న చంద్రబాబు ఆ తర్వాత సూచనలు, సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది.
తప్పులు చేసి ఉంటే సరి చేసుకోవాలని, ప్రతి మూడు నెలలకోసారి ఇటువంటి సమాచార సేకరణ జరుగుతుందని చెప్పారని తెలుస్తోంది. తప్పులు ఒక్కోసారి మనకు కనిపించవని, ఎదుటు వారికి కనిపిస్తాయని చెబుతున్నారని తెలుస్తోంది.
అంతేకాదు, తన కుప్పం నియోజకవర్గం విషయంలోను స్వయంగా వ్యతిరేకంగా నివేదిక వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారట. అయితే తాను ఇతరులకు బాధ్యతలు అప్పగించాని, వారి వల్ల పొరపాట్లు జరిగాయని నివేదిక వచ్చిందని చెబుతున్నారని తెలుస్తోంది. నేను కూడా ఇలాంటివి సరి చేసుకోవాలని చెబుతున్నారని సమాచారం.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications