వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై కోపం!: జగన్ ఒకదాని కోసం వెళ్లి మరొకటి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఆయన ఏం చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగేందుకు వెళ్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీకి వెళ్లిన జగన్ ప్రత్యేక నిధులు కోరుతారని భావిస్తే.. నిధుల దుర్వినియోగం అంటూ ఫిర్యాదు చేశారని విమర్శిస్తున్నారు. జగన్ ఫిర్యాదు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌కు నిధులు రావాలనే ఉద్దేశ్యం ఆయనకు లేదా అని ప్రశ్నిస్తున్నారు.

TDP targets YS Jagan's Delhi tour

పట్టిసీమ ప్రాజెక్టు మొదలు కాకుండానే విమర్శలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా అడిగే అజెండాతో వెళ్లి చంద్రబాబు సర్కారు పైన ఫిర్యాదు చేశారని అంటున్నారు. నిధుల దుర్వినియోగం అని ఫిర్యాదు ఫిర్యాదు చేసిన జగన్.. ఏపీకి నిధులు వద్దనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

కాగా, పట్టిసీమ ప్రాజెక్టు పైన ఎవరికి రాని అనుమానం వైయస్ జగన్మోహన్ రెడ్డికే ఎందుకు వచ్చిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రోజుల రోజుల క్రితం ప్రయత్నించారు. రాయలసీమకు నీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు గురువారం మాట్లాడుతూ.. జగన్‌కు పట్టిసీమ పైన అవగాహన లేదన్నారు.

English summary
TDP targets YS Jaganmohan Reddy's Delhi tour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X