ఆడపడుచులు, అత్తగారి ఉసురు తగిలి.. కోర్టు బోనులో వైఎస్ భారతి : వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం జగన్ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని విమర్శించారు. తనకు అడ్డువస్తే సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడరని దుయ్యబట్టారు. మోసం చేయడంలో ఆయనను మించిన జగత్ కంత్రీ దేశంలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

షర్మిలను మోసం చేసిన అన్న..
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు అనిత విమర్శించారు. ఆడపడుచులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నను ముఖ్యమంత్రి చేసేందుకు కష్టపడ్డ సొంత చెల్లి షర్మిలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ద్రోహం చేశారని దుయ్యబట్టారు. ప్రాణ రక్షణ కోసం పక్కరాష్ట్రంలో తలదాచుకుంటుందోని విమర్శించారు.

ఏపీలో అడుగుపెట్టలేని పరిస్థితిలో విజయమ్మ
..
కనీసం సీఎం జగన్ అనుమతి లేనిదే తల్లి విజయమ్మ ఏపీలో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడిందని అనిత ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం చేస్తానని మరో చెల్లి సునీతను దారుణంగా జగన్ మోసం చేశారని విమర్శించారు. జగన్ పట్ల ఆయన భార్య భారతి ఇప్పటికైనా జాగ్రత్త పడాలని కోరారు. ఆమె పరిస్థితి చూస్తోంటే జాలేస్తోందన్నారు.
Recommended Video

3భారతికి తోటి ఆడపడుసులు, అత్తగారి ఉసురు
వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీతలకు పట్టిన గతి భారతికి పట్టకూడదని తాను కోరుకుంటున్నానని అనిత పేర్కొన్నారు. సీఎం జగన్ తన అవినీతి అక్రమాలతో సంపాదించిన ఆస్తులకు భారతిని యజమానురాలుగా చేశారని విమర్శించారు. జగన్ సహధర్మచారిని అయిన కారణంగా ఆమె కోర్టు బోనులో నిలబడే పరిస్థితి వస్తోందని ఆరోపించారు. తోటి ఆడపడుసులు, అత్తగారి ఉసురు భారతికి తగులుతోందని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ చేసిన అవినీతి అక్రమాలకు భారతిని బలిచేసున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలతో పాటు .. సొంత కుటుంబంలో ఆడపడుచులకు కూడా రక్షణలేకుండా పోయిందని అనిత విమర్శలు గుప్పించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications