ఆంధ్రాలో దొంగలపై తెలంగాణ పోలీసుల ఛేజింగ్, ఫైరింగ్..!
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇవాళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పట్టణంలో పట్టపగలే జనం చూస్తుండగా బైక్ లపై వెళ్తున్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు వెంటపడి తరుముతున్నారు. ఇదే క్రమంలో వారు తప్పించుకునే ప్రయత్నం కూడా చేయడంతో పోలీసులు కాల్పులు చేశారు. గాల్లోకి పలు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినా ఆ నలుగురిలో వారికి ఒకరు మాత్రమే చిక్కారు. మిగతా ముగ్గురూ పరారయ్యారు.
తెలంగాణకు చెందిన పోలీసులు ఇవాళ సత్యసాయి జిల్లా ధర్మవరం వచ్చారు. అక్కడ బైక్ లపై వెళ్తున్న నలుగురు దొంగల్ని వారు కారులో వెంబడించారు. పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా వారు మాత్రం ఆగలేదు. దీంతో సినీ ఫక్కీలో పోలీసులు-దొంగలు కాసేపు దోబూచులాడుకున్నారు. చివరికి వారిని ఆపేందుకు తెలంగాణ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా అందులో ఒకరు మాత్రమే దొరికి మిగతా వారు పరారవ్వడంతో పోలీసులు చేసేది లేక వెనుదిరిగారు.

దీనిపై ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు అందించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణకు చెందిన పోలీసులు అక్కడ జరిగిన ఓ దొంగతనానికి సంబంధించి ఈ నలుగురిని వెతుక్కుంటూ వచ్చినట్లు తెలిపారు. అయితే వీరిని పట్టుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. అయినా ఒక్కరిని మాత్రమే పట్టుకుని తెలంగాణకు తిరిగి పయనం అయినట్లు వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications