ఉద్యోగుల ప్లాన్: కేసీఆర్పై రాహుల్ గాంధీ ఆయుధం, తీసుకొస్తారా?
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును భయపెట్టేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి!
కొద్ది రోజుల క్రితం తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించి, మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే. రాహుల్ పర్యటన నేపథ్యంలో తెలంగాణలోని రైతుల ఆత్మహత్యలు, రైతు సమస్యలు జాతీయస్థాయిలో మార్మోగాయి.
రాహుల్ పర్యటన నేపథ్యంలో తెరాస ప్రభుత్వం కూడా కదిలింది. ఈ నేపథ్యంలో దీనినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయని అంటున్నారు.

రాహుల్ గాంధీ ఆయుధాన్ని తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజనకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలోనే ఉండాలని, ఏపీ ఉద్యోగులు ఏపీకి వెళ్లాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విభజన జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని ఉద్యోగ సంఘాలు రాహుల్ గాంధీని కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. జూన్లో అతనిని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. రాహుల్ గాంధీని రప్పించడం ద్వారా తమ సమస్యను.. రైతు సమస్యలు అయినట్లుగా జాతీయం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications