"దేశ భాషలందు తెలుగు లెస్స".. తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు !
తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా...
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు
ఉగ్గుపాల భాష పలికేందుకు
సిగ్గుపడకురా... వెనక్కి తగ్గమాకురా.
ఈ వచనాలు ఒక తెలుగు సినిమాలో తెలుగు భాష ప్రాముఖ్యతను.. నేటి కాలంలో పరిస్థితిని కళ్లకు కట్టినట్టు అభివర్ణించారు. మన పూర్వికులు నుంచి చెప్తున్న మాట "దేశ భాషలందు తెలుగు లెస్స". కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వందల కొద్దీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే తప్పు. ఇది ప్రస్తుతం ఉన్న దుస్థితి.

తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కొనియాడారు. తేనెలొలుకు భాష.. మన తెలుగు భాష అంటూ కీర్తించారు. అమ్మతనంలో ఉండేంత కమ్మదనం ఉండే తెలుగు భాషను నానాటికి కనుమరుగు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పక్క రాష్ట్రాలు సైతం తమ మాతృభాష కోసం ఎంతగానో తపిస్తూ ఉద్యమాలకు సైతం వెనుకడుగు వేయని తరుణంలో మన రాష్ట్రాల్లో మాత్రం పట్టించుకునే వారే కరువయ్యారు.
చరిత్ర..
అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించింది. ప్రతి ఏడాది ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వేడుకను జరుపుకుంటారు. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చడంలో.. ఎంతగానో కృషిచేసిన గిడుగు వెంకట రమమూర్తి పంతులు.. జన్మదినోత్సవం సందర్భంగా నేడు ఈ తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్నాం.
మరోవైపు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఏపీ గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.. మంత్రులు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా 'ఎక్స్' వేదికగా తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు వెంకట రామ్మూర్తి కారణంగానే ఈరోజు మనం ఎన్నో పుస్తకాలు, పత్రికలను మనకు అర్థమయ్యే తెలుగులో చదవగలుగుతున్నామన్నారు. తెలుగువారిగా మనందరం ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవాలన్నారు.
తెలుగు వెలగాలి - నారా లోకేశ్
తెలుగు వెలగాలి, తెలుగు భాష వర్థిల్లాలి అని మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తెలుగు భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు వికాసానికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జనసేన..
వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ తరపున ఘననివాళులు అర్పిస్తూ, తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగులో మాట్లాడుదాం - తెలుగు భాషను పరిరక్షించుకుందాం అని పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్..
తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు. సామాన్యుల వాడుక భాషలో గ్రంథ రచన జరగాలని ఉద్యమించిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుని కారణంగానే ఈరోజు మనం ఎన్నో పుస్తకాలను, పత్రికలను మనకు అర్ధమయ్యే తెలుగులో చదవ… pic.twitter.com/0DXCUqOeCp
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2025
On ''Telugu Language Day'', celebrated on the birth anniversary of Sri Gidugu Venkata Ramamurthy, I convey my best wishes to all Telugu-speaking people across the globe. Telugu is not only one of the most spoken languages but also a treasure of literature, poetry, and pic.twitter.com/52cXdsyrOE
— governorap (@governorap) August 29, 2025
తెలుగు వాడుక భాష ఉద్యమపితామహుడు, కొద్దిమందికే పరిమితమైన చదువును వ్యవహారిక భాషలో అందరికీ అందేలా చేసిన చరిత్రకారుడు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. pic.twitter.com/WNMfOoIKIy
— JanaSena Party (@JanaSenaParty) August 29, 2025
తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/3EI9MHuY2O
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2025
తెలుగు వెలగాలి, తెలుగు భాష వర్థిల్లాల్లి. తెలుగు భాషా ఉద్యమ కర్త గిడుగు రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా వికాసానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. pic.twitter.com/eh6bNhiQ66
— Lokesh Nara (@naralokesh) August 29, 2025
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications