వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 15లోగా రుణమాఫీ చేస్తాం: పత్తిపాటి

|
Google Oneindia TeluguNews

The farmers loan will be waived before October 15th: Pattipati
హైదరాబాద్/కర్నూలు: అక్టోబర్‌ మొదటి వారంలో తొలివిడత రుణమాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం మూడు విడతల్లో రుణాలు మాఫీ చేస్తామన్నారు.

50వేల లోపు రుణం తీసుకున్న రైతులు 40శాతం మంది ఉన్నారని, తుది జాబితా రాగానే అక్టోబర్ 15లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆధార్ కార్డుల అనుసంధానంలో సమస్యులుంటే అలాంటివారు మిగిలిన గుర్తింపు కార్డులు చూపిస్తే అర్హుల జాబితాలో చేరుస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు.

కర్నూలులో పర్యటించిన సందర్భంగా రైతు రుణాల మాఫీ అంశంపై కలిసిన పలువురు రైతుల నాయకుల సందేహాలను మంత్రి పుల్లారావును నివృత్తి చేశారు. అనంతరం స్టేట్ గెస్ట్ హౌజ్ నుంచి మంత్రి స్థానిక రైతుబాజర్‌కు చేరుకుని రైతులతో మాట్లాడారు.

కర్నూలు జిల్లాకు 12.5 వేల టన్నుల యూరియాను సరఫరా చేస్తామని, నకిలీ విత్తనాలు, పురుగుమందుల అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

English summary

 Andhra Pradesh Minister Pattipati Pulla Rao on Wednesday said that the farmers loan will be waived before October 15th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X