Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ జిల్లాల్లో మరి కొంతసేపట్లో పిడుగులు పడే అవకాశం...ఈ నెల 22 లేదా 23న అల్పపీడినం

అమరావతి:ఇటీవలి కాలంలో వాతావరణంలోని మార్పులను ఖచ్చితత్వానికి దగ్గరగా అంచనా వేయగలుగుతున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా మరో కీలకమైన హెచ్చరిక చేసింది.

వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా మరికొద్ది సేపట్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడే అశకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమప్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. విశాఖలోని చోడవరం, బుచ్చయ్యపేట, కశింకోట, రావికమతం, మాకవరపాలెం, యలమంచిలి, మునగపాకలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

The possibility of thunderbolts down in these districts:State Disaster Management Department

అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల, వై.రామవరం, గంగవరం, రంపచోడవరం మండలాలకు పిడుగు హెచ్చరికలు జారీచేశారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆరుబయట నుంచి వీలైనంత త్వరగా సురక్షిత భవనాలకు తరలివెళ్లి తలదాచుకోవాలని వారు సూచించారు.

ఇదిలా ఉండగా ఒడిసా నుంచి కోస్తా మీదుగా తమిళనాడువరకు ద్రోణి కొనసాగుతున్న క్రమంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ నెల 22 లేదా 23న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నదని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణుడు ముందస్తు హెచ్చరిక చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+