ఈ జిల్లాల్లో మరి కొంతసేపట్లో పిడుగులు పడే అవకాశం...ఈ నెల 22 లేదా 23న అల్పపీడినం
అమరావతి:ఇటీవలి కాలంలో వాతావరణంలోని మార్పులను ఖచ్చితత్వానికి దగ్గరగా అంచనా వేయగలుగుతున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా మరో కీలకమైన హెచ్చరిక చేసింది.
వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా మరికొద్ది సేపట్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడే అశకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమప్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. విశాఖలోని చోడవరం, బుచ్చయ్యపేట, కశింకోట, రావికమతం, మాకవరపాలెం, యలమంచిలి, మునగపాకలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల, వై.రామవరం, గంగవరం, రంపచోడవరం మండలాలకు పిడుగు హెచ్చరికలు జారీచేశారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆరుబయట నుంచి వీలైనంత త్వరగా సురక్షిత భవనాలకు తరలివెళ్లి తలదాచుకోవాలని వారు సూచించారు.
ఇదిలా ఉండగా ఒడిసా నుంచి కోస్తా మీదుగా తమిళనాడువరకు ద్రోణి కొనసాగుతున్న క్రమంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ నెల 22 లేదా 23న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నదని ఆర్టీజీఎస్, ఇస్రో నిపుణుడు ముందస్తు హెచ్చరిక చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications