విశాఖ భూకుంభకోణంలో మరో బాంబు: ఇంకో కుంభకోణాన్ని బయటపెడుతానన్న విష్ణుకుమార్!
తాము కొనుగోలు చేసిన భూమి ఐదేళ్ల తర్వాత ఉంటుందో మాయమవుతుందో అన్న దుస్థితి ఉంటే.. ఇక విశాఖలో వ్యాపార అనుకూల వాతావరణం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.
అమరావతి: విశాఖ భూకుంభకోణాలపై ఇప్పటికే ఉన్న ఆరోపణలతో సతమతమవుతున్న టీడీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరో షాక్ ఇచ్చారు. విశాఖలో జరిగిన మరో భూ కుంభకోణాన్ని 15రోజుల్లో బయటపెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
భూకుంభకోణాల్లో ప్రజాప్రతినిధులే నేరుగా జోక్యం చేసుకున్న ఉదంతాలున్నాయని విష్ణుకుమార్ ఆరోపించారు. ప్రస్తుతం భూకుంభకోణానికి సంబంధించి అన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నానని, త్వరలోనే వాటిని బయటపెడుతానని అన్నారు. విశాఖలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన భూకుంభకోణాలపై ప్రభుత్వం వేసిన సిట్ విచారణతో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో లేదన్నారు.

విశాఖ భూకుంభకోణాలపై ఆరు నెలల క్రితం తాను శాసనసభలో ప్రస్తావించినప్పుడే విచారణ చేయిస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదన్నారు. అసెంబ్లీ సాక్షిగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అప్పట్లో తాను డిమాండ్ చేశానని గుర్తుచేశారు. అసెంబ్లీలో జగన్ ఛాంబర్ లీకేజీపై సీఐడీ విచారణకు ఆదేశించినంత వేగంగా విశాఖ భూకుంభకోణాలపై స్పందించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు.
తొలుత బహిరంగ విచారణ అని ప్రకటించి ఆ తర్వాత సిట్ తో విచారణ చేయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో రిటైర్డ్ జడ్జిని సభ్యుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. బహిరంగ విచారణ జరిపితే భూములు ఎన్ని రకాలుగా కబ్జా పాలవుతున్నాయో తెలిసే అవకాశముండేదన్నారు.
తాము కొనుగోలు చేసిన భూమి ఐదేళ్ల తర్వాత ఉంటుందో మాయమవుతుందో అన్న దుస్థితి ఉంటే.. ఇక విశాఖలో వ్యాపార అనుకూల వాతావరణం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈ కుంభకోణం ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని చెప్పారు. భూకుంభకోణంపై తాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అది సివిల్ వివాదం కాబట్టి జోక్యం చేసుకోలేదని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications