ఎర్రచందనం స్మగ్లర్లతో సీఎం చంద్రబాబుకు ముప్పు.. హెచ్చరించిన నిఘా విభాగం!
ఎర్రచందనం స్మగ్లర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ ఢిల్లీ పర్యటనల్లో ఇకపై మెట్రో రైలులో ప్రయాణం మంచిది కాదని నిఘా విభాగం హెచ్చరించింది.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై రాష్ట్ర నిఘా విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
ఈ మేరకు ఏపీ రెసిడెంట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో ఇకపై మెట్రో రైలులో ప్రయాణం మంచిది కాదని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ 'మెట్రో' ప్రయాణం ప్రమాదకరమని నిఘా విభాగం హెచ్చరించింది.

'మెట్రో'లో సీఎంకు భద్రత కల్పించడం ఇబ్బందికరమని, ఢిల్లీ పర్యటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో, సాయుధ కమాండో రక్షణలో రోడ్డుమార్గం ద్వారానే చంద్రబాబును తీసుకువెళ్లాలని, ఉగ్రవాదులు, మత ఛాందసవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిఘా విభాగం హెచ్చరించింది.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications