Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
ఏపీలో ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒక్క ఆధారం కూడా సాధించలేకపోయారు. అయితే ఊహాజనిత ఆధారాలతో వేముల సతీష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపారు. అనంతరం కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ ను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడ కోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. సతీష్ ను మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అయితే పోలీసులు, తల్లి సమక్షంలోనే అతన్ని విచారించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు అతన్ని కస్టడీలో విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు ఈ కేసులో బలమైన ఆధారాలను సంపాదించడంలో విఫలమైన విజయవాడ పోలీసులు వేముల దుర్గారావు అనే మరో అనుమానితుడిని గతంలో అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు విచారించినా కోర్టులో హాజరుపర్చలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని విడిచిపెట్టేశారు. అదే సమయంలో వేముల సతీష్ రిమాండ్ రిపోర్టులో ఏ2 ప్రోద్భలంతో ఏ1 అయిన సతీష్ దాడికి పాల్పడినట్లు చెప్పారు. కానీ ఇప్పటికీ ఏ2 ఎవరో చెప్పలేదు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications