ముగ్గురు మహిళా మావోయిస్టుల అరెస్ట్: వారిలో ఆర్కే అంగరక్షకురాలు : విశాఖ పోలీసుల వ్యూహం ...!
హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లు. వీరు మౌలాలి లో తల దాచుకున్నారనే సమాచారం తో పక్కా వ్యూహంతో వెళ్లిన విశాఖ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరిని అక్రమంగా అరెస్ట్ చేసారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆరోపిస్తోంది...
హైదరాబాద్ నగరంలో నగరంలో ముగ్గురు మహిళా మావోయిస్టులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. అనూష, అన్న పూర్ణ, భవానీలను హైదరాబాద్లోని మౌలాలీలో అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వీరు తల దాచుకున్నారనే పక్కా సమాచారంతో ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు, హైదరాబాద్ నగర పోలీసుల సహకారంతో మౌలాలీలో దాడి నిర్వహించారు. ఒక ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారు.

వీరిలో అనూష ...మావో యిస్టు పార్టీలో కీలక నేత ఆర్కేకు అంగరక్షకురాలిగా పనిచేస్తోందని పోలీసులు నిర్ధారించారు. అలాగే అనూష పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడినట్లు గుర్తించారు. సిక్కవరప్పాడు, జుడోకో గ్రామంలో పోలీసులపై కాల్పులు, 2018 నవంబర్లో ఆర్కే ఆదేశాల మేరకు పోలీసులపై మందుపాతర పేల్చిన ఘటనలో అనూష పాల్గొన్నట్లు పోలీసులు వారి వివరాలను వెల్లడించారు.

ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ల తండ్రి రమణయ్య కుల నిర్మూలణ పోరాట సమితితో పనిచేసినట్లు పోలీసులు చెడుతున్నా రు. 2017లో మావోయిస్టు అగ్రనేత ఆర్కేను అనూష, అన్నపూర్ణలు కలిశారని, అనంతరం అనూష పేరు మార్చుకుని యాంగ్జి అనే పేరుతో మావోయిస్టు కార్యకలాపాల్లో సిద్ధహస్తురాలైందని పోలీసులు గుర్తించారు. అయితే, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మాత్రం వీరిని అక్రమంగా అరెస్ట్ చేసారని ఆరోపిస్తోంది. వారు అనూష, అన్నపూర్ణ లు చైతన్య మహిళా సంఘ ప్రతినిధులుగా...భవానీ ని అమరుల బంధు మిత్రుల సంఘ ప్రతినిధిగా పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న సమయం లో ఆ ముగ్గురిని అరెస్ట్ చేసారని..వారిని విడుదల చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్ చేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications