tirupati lok sabha bypoll results: 2 లక్షలు దాటిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం
చిత్తూరు: తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైప్పటి నుంచీ వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యత చూపుతూ రెండు లక్షలకుపైగా ఆధిక్యం చాటారు.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,00,411 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి భారీ తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వైయస్సార్సీపి అభ్యర్థికి 4,61,366 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 2,55,271 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 43,317 ఓట్లు వచ్చాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 7233 ఓట్లు రాగా, నోాటాకు 11,509 ఓట్లు పోలవడం గమనార్హం. కౌంటింగ్ ప్రక్రియను నలుగురు పరిశీలకులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ విజయం దాదాపు ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయ.
వైసీపీ- 4,61,366 (57 శాతం)
టీడీపీ- 2,55,271 (31.5 శాతం)
బీజేపీ-43,317 (5.4 శాతం)
కాంగ్రెస్- 7,233(0.9 శాతం)
సీపీఎం- 4,232 (0.6 శాతం)
ఇతరులు- 26,316 (3.3 శాతం)
నోటా-11,509 (1.4 శాతం)
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications