CM Jagan: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ఆహ్వానించిన టీటీడీ..
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి జగన్ ను డిఫ్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఆహ్వానించారు. జగన్ కు ఆహ్వాన పత్రికతో పాటు వెంకటేశ్వరస్వామి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను వేద పండితులు ఆశీర్వదించారు. తిరుమలలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఆగమోక్తంగా టీటీడీ పూర్త చేసింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంవత్సరానికి నాలుగుసార్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మెత్సవాలు, వైకుంఠ ఏకాదశి రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
l

మరోవైపు తిరుమలకు కాలినడక వెళ్లే మార్గంలో నిబంధనలు కొనసాగుతోన్నాయి. నడక మార్గంలో వన్యమృగాల సంచారం తగ్గేవరకు ఆంక్షాలు కొనసాగుతాయని సీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. అలిపిరి నడక మార్గంలో నిఘా కొనసాతుందని చెప్పారు. నడక మార్గంలో ఎలుగుబంట్లు, చిరుత పులులు ఉన్నట్లు ట్రాప్ కెమెరా ద్వారా గుర్తించినట్లు వివరించారు. ఇంకా ఐదు చిరుతలు నడక మార్గంలో తిరుగుతున్నాయని.. వాటిని బంధించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పిటికే ఐదు చిరుతలను బంధించినట్లు వివరించారు. నడక మార్గంలో ఇరువైపుల అటవీ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిపారు. మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 17 గంటల సమయం పడుతోంది. నిన్న 66,199 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications