తిరుమల లడ్డూ విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంట్రీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 95,094 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,909 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.93 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.

టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.66 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. రికార్డు స్థాయిలో 3.23 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీని అందిస్తున్నారు. అదనపు షెడ్లను అమర్చారు.

TTD Signs MoU with CSIR-CFTRI to Ensure Safe Nutritious High-Quality Tirumala Laddu and Prasadams

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీపై టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మైసూరుకు చెందిన సీఎస్ఐఆర్- సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. లడ్డూతో పాటు శ్రీవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

బెంగళూరులో నిర్వహించిన రెండు రోజుల రైజ్ కాంక్లేవ్ సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార భద్రత శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో టీటీడీ, సీఎస్ఐఆర్ ప్రతినిధులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సదస్సులో టీటీడీ తరఫున ప్రోక్యూర్మెంట్ జీఎం ఉమా శంకర్ పాల్గొన్నారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించి ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

దీనివల్ల తిరుమల లడ్డూ, ఇతర ప్రసాదాల నాణ్యత, భద్రత మరింత మెరుగుపడుతుంది. ముడి పదార్థాల కొనుగోలు నుంచి ప్రసాదాల తయారీ, పంపిణీ వరకు కఠినమైన నాణ్యత ప్రమాణాలు, విధి విధానాలను అమలు చేస్తారు. ముడి పదార్థాల నిల్వ, వాటి కొనుగోలు, పరీక్షల ప్రక్రియల్లో శాస్త్రీయంగా నిర్ధారించిన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టి కలుషిత ప్రమాదాలను తగ్గిస్తారు. రుచి, నాణ్యత, సంప్రదాయ విలువలకు భంగం కలగకుండా ప్రసాదాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్యాకేజింగ్, పరిశోధన చర్యలు చేపడతారు.

టీటీడీ ఫుడ్ అనలిస్టులు, సంబంధిత సిబ్బందికి ఆధునిక పరీక్షా విధానాలు, నమూనాల సేకరణ, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత నిర్ధారణ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తారు. సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి సాంకేతిక సూచనలు, పరిశోధన ఆధారిత సహకారం అందిస్తారు. ఈ ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాల నాణ్యత, మరింత మెరుగుపడుతుందని టీటీడీ ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+