ఫోన్ చేసినా తగ్గని బాబు: ప్రైవేటు వాహనాల్లో వచ్చి మోడీకి రాజీనామా ఇచ్చిన సుజన, అశోక్
న్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి, పది ఇరవై నిమిషాలు మాట్లాడారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వైఖరిలో మార్పు రాలేదు. వారు రాజీనామాకే మొగ్గు చూపారు. రాజీనామా వద్దని మోడీ చెప్పలేదా, హోదాపై హామీ రాకపోవడంతో చంద్రబాబు తగ్గలేదా అందుకే రాజీనామాలు అనివార్యం అయ్యాయా అనే చర్చ సాగుతోంది.
Recommended Video
48 గంటలు వేచి చూడమంటే గంటలో మోడీకి షాకిచ్చారు: బాబు ఎదుట 2 ప్రశ్నలు!
మోడీ కేబినెట్లో అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు మంత్రులుగా ఉన్నారు. సుజనా సైన్స్ అండ్ టెక్నాలజీ, అశోక్ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. వీరు సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని మోడీని కలిశారు. వారు ప్రయివేటు వాహనాల్లో వచ్చారు.
రాజీనామాలు సమర్పించిన అశోక్, సుజన
ప్రధాని మోడీతో భేటీ కోసం అశోక్, సుజనలు ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. ఆయన అపాయింటుమెంట్ ఆరు గంటలకు దొరికింది. ఆయనను కలిసి వారిద్దరు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.
నాలుగేళ్లుగా కేంద్రమంత్రులుగా
2014 మే 26న అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుజనా చౌదరి 2014 నవంబర్ 9వ తేదీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల నేపథ్యంలో ఉప్పుడు రాజీనామా చేశారు.
ఎట్టకేలకు అఫాయింటుమెంట్
కేంద్ర మంత్రివర్గం నుంచి తమ ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్టు బుధవారం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ ఉదయం నుంచి రాజీనామా పత్రాలతో ప్రధానిని కలిసేందుకు వేచిచూసిన సుజనా, అశోక్కు ఎట్టకేలకు ఆయన అపాయింట్మెంట్ లభించింది.
మాట్లాడేందుకు కుదరలేదు
అంతకుముందు, చంద్రబాబుతో మోడీ పది నుంచి ఇరవై నిమిషాలు మాట్లాడారు. నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రధానితో మాట్లాడేందుకు ప్రయత్నించగా వీలుపడలేదు. ఈ రోజు రాజస్థాన్ పర్యటన నేపథ్యంలో మాట్లాడటం కుదరలేదు. దీంతో మోడీ ఫోన్ చేశారు.