వాలెంటైన్స్ డే: 'తల్లి దండ్రులను పిలిపించి మరీ పెళ్లిళ్లు చేస్తాం'
బెంగుళూరు: వాలెంటైన్స్ డే కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. కానీ, భారత్లో మాత్రం అందుకు భిన్నంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 14న బయట కనిపించే ప్రేమికులను పట్టుకుని వివాహం చేస్తామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ), భజరంగ్ దళ్ సంస్ధలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు పేరుతో విచ్చలవిడి కార్యకలాపాలు చేస్తే ఊరుకునేది లేదని వీహెచ్పీ నేతలు రామరాజు, వెంకటేశ్వర రాజు హెచ్చరించారు. ప్రేమికులు ఆరోజు జంటగా కనిపిస్తే వారి తల్లిదండ్రులను పిలిపించి పెళ్లిళ్లు చేస్తామని వారు స్పష్టం చేశారు.

పబ్లు, హోటళ్లు, రిసార్ట్స్ ప్రేమికుల రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకూడదని వీహెచ్పీ నేతలు సోమవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications