వెళ్లిపోమన్న చింతల, అందరిముందు వెక్కివెక్కి ఏడ్చిన పీజేఆర్ కూతురు
హైదరాబాద్: దివంగత పీ జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) తనయ విజయా రెడ్డి సోమవారం నాడు కంటతడి పెట్టారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఖైరతాబాద్ శాసన సభ్యుడు చింతల రామచంద్రా రెడ్డి ఆమెను వేదిక పై నుంచి దిగిపోవాలని సూచించారు. దీంతో ఆమె కంటతడి పెట్టారు.
పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, విజయా రెడ్డి తదితరులు వచ్చారు.

విజయా రెడ్డి వేదిక పైకి వచ్చారు. ఆమె ఏ హోదాతో వేదిక పైకి వచ్చారని చింతల ప్రశ్నించారు. వేదిక దిగిపోవాలని సూచించారు. దీంతో విజయా రెడ్డి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె అందరి ఎదుటే వెక్కి వెక్కి ఏడ్చారు.
అయితే, ఇదంతా నాయిని నర్సింహా రెడ్డి సమక్షంలోనే జరిగింది. నాయిని చింతల రామచంద్రా రెడ్డిని వారించారు. విజయా రెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే, విజయా రెడ్డి మాత్రం నాయిని చెప్పినా ఆగకుండా, ఏడుస్తూనే వెళ్లిపోయారు. అక్కడి వారు కొందరు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications