ఇది మరో అపూర్వ ఘట్టం: విజయ సాయి రెడ్డి, వారిని రెండ్రోజుల పాటు అరెస్ట్ చేశారని..
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ యాత్ర నేటితో 250 రోజులు పూర్తయ్యాయని, ఇది అపూర్వఘట్టమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గురువారం అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
'ప్రజా సంకల్ప యాత్రలో మరో అపూర్వ ఘట్టం! 250 రోజులు...11 జిల్లాలు... 2848 కి.మీ. గత ఏడాది నవంబర్ 6న మన అధినేత శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 250 రోజులు పూర్తయ్యాయి.

ఆయన మరో ట్వీట్లో.. ఇటీవల మైనార్టీ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపించిన యువకులను రెండు రోజుల పాటు అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. వారిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై బొత్స ఆగ్రహం
టీడీపీ నాలుగేళ్ల పాలనలో జిల్లాలోగాని, చీపురుపల్లి నియోజకవర్గంలోగాని జరిగిన అభివృద్ధి శూన్యమని వైసీపీ వైత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మెరకముడిదాంలో రూ.3లక్షలతో నిర్మించిన తొమ్మిది అడుగుల దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ పరిపాలనలో ఆ పార్టీ గ్రామ స్థాయి నేతల నుంచి అందరూ దోచుకొని, దాచుకునే విధానం పాటిస్తున్నారన్నారు.
గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క మెరకముడిదాం గ్రామంలోనే 850 ఇళ్లను పేదలకు ఇచ్చామన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు కనీసం అందులో పది శాతం ఇళ్లు 85 కూడా మంజూరు చేయలేదన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ, పేదల అభివృద్ధికే పాటుపడుతున్న జగన్ను వచ్చే ఎన్నికల్లో దీవించాలన్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications