విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..!
ఏపీలోని విశాఖపట్నం (visakhapatnam) నుంచి తెలంగాణలోని చర్లపల్లికి రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలులో తూర్పు కోస్తా రైల్వే మార్పు చేసింది. ఇప్పటివరకూ ప్రత్యేక రైలుగా నడుపుతున్న ఈ ఎక్స్ ప్రెస్ ను కాస్తా రెగ్యులర్ రైలుగా మార్చింది. ఈ మార్పు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది, హాల్ట్ లు ఎలా ఉంటాయి, ఏయే కోచ్ లు ఉంటాయన్న వివరాలను తూర్పు కోస్తా రైల్వే విడుదల చేసింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు (నం.18527)ను ఏప్రిల్ 3 నుంచి రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైలుగా మార్చారు. ప్రతీ శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే చర్లపల్లి నుంచి విశాఖకు నడుపుతున్న మ్యాచింగ్ రైలు (నం.18528)ను కూడా రెగ్యులర్ సర్వీస్ గా మార్చారు. ఈ రైలు ఏప్రిల్ 4 నుంచి ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రైళ్లకూ 12 హాల్ట్ లు ఇచ్చారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం-చర్లపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలుకు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేటలో హాల్ట్ లు ఇచ్చారు. విశాఖలో సాయంత్రం 5.30కు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 8గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అలాగే చర్లపల్లిలో మధ్యాహ్నం 2.30కు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 5.20కు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ నాలుగు జనరల్ కోచ్ లు, ఆరు స్లీపర్ కోచ్ లు, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ లు 4, సెకండ్ ఏసీ కోచ్ 1, ధర్డ్ ఏసీ కోచ్ 1 ఉంటాయి. వీటితో పాటు దివ్యాంగుల కోచ్ కూడా ఉంటుంది.
-
విశాఖలో కుమారస్వామి- స్టీల్ ప్లాంట్ రోడ్ మ్యాప్ ఆయన చేతిలో -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
టికెట్ క్యాన్సిల్ చేస్తే పూర్తి డబ్బులు వెనక్కి: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! -
ఐఆర్సీటీసీలో 3 కోట్ల ఫేక్ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ -
అమృత్ భారత్ రైలులో పురిటి నొప్పులు.. కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్ళేలోపే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!













Click it and Unblock the Notifications