మోడీ టూర్ వేళ విశాఖ ఉద్రిక్తం-వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనలు మళ్లీ మొదలు..
ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖ రాబోతున్నారు. కీలక ప్రాజెక్టులతో పాటు స్ధానికంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం జగన్ తో కలిసి శంఖుస్ధాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్న స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా చేరింది. ప్రధాని టూర్ వేళ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు తప్పడంలేదు.
Ahead of #PMModi 's visit to #Visakhapatnam, large number of #Vizag Steel Plant workers, all party trade Unions came on the roads, staged protests, Demanding that the Central govt should take back its decision to #privatisation of the #VisakhapatnamSteelPlant.#AndhraPradesh pic.twitter.com/YLkgZq5iRJ
— Surya Reddy (@jsuryareddy) November 9, 2022
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇవాళ మరోసారి కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు ఏడాదిన్నరగా ఉద్యమాలు చేస్తున్న కార్మికులు ఇవాళ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బైక్ లను పక్కనబెట్టి నడుచుకుంటూనే ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు కూడా అడ్డుచెప్పే పరిస్దితి లేకపోయింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము ఉద్యమాలు చేస్తుంటే అధికార, విపక్ష పార్టీలు తమకు సహకరించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధానిని కోరుతూ కార్మికులు ఇవాళ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోడీ విశాఖ టూర్ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కార్మికులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ దిశగా తమకు సహకరించాలని కార్మికులు కోరుతున్నారు. ఇప్పటికే సీపీఐ నేతలు ప్రధాని టూర్ వేళ ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. దీంతో ప్రధాని టూర్ ఎలా జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఇది అధికారిక పర్యటన మాత్రమేనని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దూరంగా ఉన్న విపక్షాలు కార్మికుల పక్షాన నిరసనల్లో పాల్గొంటాయా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications