తెరాసలో విలీనం చేయం, తొలగిస్తున్నారు: తమ్మినేని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని తెరాసలో విలీనం చేయాల్సిన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత తమ్మినేని సీతారాం శుక్రవారం అన్నారు. తమ పార్టీ సానుభూతిపరులు అనే పేరుతో పలువురు ఫీల్డు అసిస్టెంట్లు, రేషన్ డీలర్లను తెలుగుదేశం పార్టీ తొలగిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ నేతల పైన చంద్రబాబు విచారణ చేయించగలరా అని సవాల్ చేశారు.
కాగా, తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తెరాసలో కలిపేందుకు ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నారని టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీలే కారణమని జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఆ అక్కసుతోనే తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్లు ప్రసారం కాకుండా జగనే చేస్తున్నారా అని ప్రశ్నించారు. గురువారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మీడియానే కారణమని జగన్ మాట్లాడడం ఆయన అవివేకమన్నారు.
మీడియా వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జగన్ మాట్లాడటం చూస్తే తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్ల ప్రసారాలను కేసీఆర్ నిలిపివేయడానికి జగనే కారణమని చెప్పక తప్పదన్నారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం చూస్తే జగన్-కేసీఆర్ మధ్య ఉన్న సంబంధాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.
కేసీఆర్తో ఉన్న ఇలాంటి సంబంధాల కారణంగా తెలంగాణలోతమ పార్టీని తెరాసలో విలీనం చేసేందుకు జగన్ తహతహలాడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిచేసే శక్తిసామర్ధ్యాలు జగన్లో లేవని ప్రజలు గ్రహించే చంద్రబాబును అధికారంలోకి తెచ్చారన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏమిటో టీడీపీ ప్రభుత్వం నిరూపించిందన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications