Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'టిడిపి వాళ్లు మోసగాళ్లా తెలివి తక్కువ వాళ్లా, పవన్‌కైనా-జగన్‌కైనా ఓకే'

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు తెలివి తక్కువ వాళ్లా లేక మోసగాళ్లా చెప్పాలని సిపిఎం నేత బీవీ రాఘవులు ఆదివారం నాడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా తాము మద్దతిస్తామని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పోరాటం చేసినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాడినా తమ సహకారం ఉంటుందని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలె తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.

ప్రత్యేక హోదాతో ఉపయోగం ఉండదని ఇప్పుడు టిడిపి నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. హోదాతో ఉపయోగమా కాదా అనే విషయం ఎన్నికలకు ముందు వారికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. టిడిపి వాళ్లు తెలివి తక్కువ వాల్లా, లేక మోసగాళ్లా చెప్పాలన్నారు. తాము కాలుష్య రహిత పరిశ్రమలకు అనుకూలమని చెప్పారు.

 'We will support any party for Special Tag issue'

రాఘవులు, ఎవరు పోరాడినా మద్దతిస్తాం, బీవీ రాఘవులు,
హోదా విషయంలో టిడిపి మోసం చేసింది, హోదాతో ఉపయగంగో ఉంటుందో లేదో ఎన్నికలకు ముందు తెలియదా, టిడిప వాళ్లు తెలివి తక్కువ వాళ్లా, మోసగాళ్లా చెప్పాలి, కలుష్య రహిత పరిశ్రమలకు అనుకూలం,

హోదా ఏపీకి జీవన రేఖ: రఘువీరా

ఏపీకి ప్రత్యేక హోదా జీవన రేఖ వంటిది అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

నకిలీ విత్తనాల కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డు అంతా అవినీతి సమాచారమేనని, కమీషన్లు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రైతు సమస్యల పైన 19న కర్నూలులో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+